Newsబ్రేకింగ్‌: ఏపీలో మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌: ఏపీలో మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ‌లో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం క‌రోనా భారీన ప‌డుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌తో పాటు టీడీపీకే చెందిన క‌ర‌ణం బ‌ల‌రాం, వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావుకు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ కేబినెట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి క‌రోనా వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆయ‌న హోం క్వారంటైన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో మంత్రి వ‌చ్చి చేరారు. ఆ మంత్రి ఎవ‌రో కాదు ఆదిమూల‌పు సురేష్‌. కొద్ది రోజులుగా బ‌యట కార్య‌క్ర‌మాల్లో ఎక్కువుగా తిరుగుతోన్న ఆయ‌న‌కు క‌రోనా ఉన్న‌ట్టు అనుమానం రావ‌డంతో కోవిడ్ టెస్టులు చేయ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తేలింది. దీంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్లో ఉన్న‌ట్టు తేలింది. మ‌రోవైపు మంత్రి సురేష్‌ను క‌లిసిన వారి వివ‌రాలు కూడా తీసుకుంటున్నారు. ఇక ఏపీలో క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే 3.53 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. మ‌ర‌ణాల సంఖ్య 3282కు చేరుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news