Moviesమహేష్ మహర్షికి సెన్సార్ షాక్..!

మహేష్ మహర్షికి సెన్సార్ షాక్..!

మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా మే 9న అంటే మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడని తెలిసిందే. ఈమధ్యనే ట్రైలర్ రిలీజ్ అవగా సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు ఘట్టమనేని ఫ్యాన్స్.

మహేష్ మహర్షి సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా మొత్తం క్లీన్ ఎంటర్టైనర్ గా ఉన్నా కొన్ని ఫైట్స్ ఉండటంతో ఏ కూడా ఇవ్వాల్సి వచ్చిందట. అంతేకాదు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని చెప్పినట్టు టాక్. వంశీ పైడిపల్లి మూడేళ్లు కష్టపడి చేసిన సినిమా మహర్షి మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి.

మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా వస్తున్న మహర్షి రికార్డుల్లో కూడా ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరిని మెప్పించేందుకు వస్తున్న మహర్షి ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news