Politicsవిషాదం..! ప్రముఖ టీడీపీ నేత ఇక లేరు..

విషాదం..! ప్రముఖ టీడీపీ నేత ఇక లేరు..

ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నాయకుడు కాళ్ళ ఆదినారాయణ ఈ రోజు గుండెపోటుతో మరణించారు. గుండెపోటు తీవ్రంగా రావటంతో ఆసుపత్రి కి వెళ్లే లోగే ఉన్న చోటనే కుప్పకూలిపోయారు. కొద్దీ సేపటికే అయన మరణించారనే వార్త జిల్లా అంతటా తెలియటంతో టీడీపీ నాయకులూ వెంటనే అయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కొన్ని నెలల క్రితమే ప్రముఖ టీడీపీ నాయకుడా ఆనం వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే, ఇది జరిగిన కొన్ని రోజులకే మరో విషాదం చోటు చేసుకోవటం నిజంగా బాధకారం.
ఆదినారాయణ నల్గొండ జిల్లా లోని వెల్లిదండ గ్రామానికి చెందిన సీనియర్ లీడర్. నిత్యం ప్రజా సమస్యలు
తెలుసుకుంటూ వారి అభివృద్ధి కోసం పరి తపించే నాయకుడు. అయితే ఆదినారాయణ మరణ వార్త తెలుసుకున్న వెంటనే జిల్లా మండల అధ్యక్షుడు ఎస్ కె చాంద్ మియా, జిల్లా కార్యకర్తలు వీరయ్య, శ్రీనివాస్, వీరాంజనేయులు తక్షణం అక్కడికి చేరుకొని మృతదేహానికి పుష్ప మాలలు వేసి ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

https://youtu.be/eQmyYIe9-Qs

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news