Gossipsనిజంగా ‘ఏడు చేపల కథ’ ట్రైలర్ కుర్రాళ్లకు పిచెకిస్తుంది..?

నిజంగా ‘ఏడు చేపల కథ’ ట్రైలర్ కుర్రాళ్లకు పిచెకిస్తుంది..?

ఈ మద్య ట్రైలర్ తోనే సినిమా పరిస్థితి ఏంటో చెప్పేసే విధంగా కట్ చేస్తున్నారు. అందుకే టీజర్, ట్రైలర్ విషయంలో కాస్త ఆలస్యం అయినా అందులో పర్ఫెక్షన్ ఉండాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. గత కొంత కాలంగా కొన్ని ట్రైలర్స్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా చూపించడంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి బూతు ట్రైలర్లు ఈ మద్య బాగానే వస్తున్నారు. ఇటీవల డిగ్రీ కాలేజ్ సినిమా చూసి అసలు ఇది సినిమానా..ఫోర్న్ మూవీనా అన్న అనుమానాలు వచ్చేలా ట్రైలర్ కట్ చేశారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

ఆ మద్య ‘ఏడు చేపల కథ’ పేరుతో ఆ మధ్య విడుదలైన ఓ సినిమా టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అడల్ట్ కామెడీ కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడం, ఇప్పటి వరకు తెలుగులో ఎన్నడూ లేని విధంగా శృంగార సీన్లు ఉండటంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లో బూతు కంటెంటె డోస్ బాగానే పెంచారు. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా అడల్ట్ కంటెంటుతో ఈ చిత్రం రాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించాడు.

ఇందులో అతడి పాత్ర పేరు టెమ్ట్ రవి..ఆడవారిని చూడగానే టెమ్ట్ అయ్యేపాత్రలో నటిస్తున్నాడు. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల వెంట పడి తమ కోరికలు తీర్చమని అంటారు..కానీ ఈ సినిమాలో రివర్స్ గా..టెమ్ట్ రవి వీక్‌నెస్ తెలుసుకున్న కొందరు మహిళలు అతడిని కావాలనే రెచ్చగొట్టి… వద్దంటున్నా బలవంతంగా కామ సుఖాన్ని తీర్చుకుంటున్న సీన్లు ట్రైలర్లో కనపించాయి.జివిఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

https://youtu.be/PUwMkAfQB24

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news