Videosవైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్.. క్రైమ్ థ్రిల్లర్ ఎటాక్..!

వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్.. క్రైమ్ థ్రిల్లర్ ఎటాక్..!

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ ఏలకంటి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. మంచు లక్ష్మి మరోసారి తన నటనతో మెప్పించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ బాగా కట్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా భర్త మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.

ఇక సినిమాలో మంచు లక్ష్మితో పాటుగా ఆదర్శ్, సామ్రాట్, ప్రియదర్శి నటిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫాక్టర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు. అయితే హస్బండ్ మర్డర్ కేసు అనగానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కహాని సినిమాకు కాస్త దగ్గర పోలికలు ఉన్నట్టు తెలుస్తుంది.

కహాని సినిమా తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల రీమేక్ చేశారు. ఇక వైఫ్ ఆఫ్ రామ్ కూడా అదే తరహాలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. సినిమా కోసం మంచు లక్ష్మి చాలా హార్డ్ వర్క్ చేసిందని తెలుస్తుంది. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మంచు లక్ష్మి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news