Gossipsచరణ్ నిర్ణయాలతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్..!

చరణ్ నిర్ణయాలతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం హిట్ తో కెరియర్ లో మరింత జోష్ పెంచుకున్నాడని చెప్పొచ్చు. ఓపక్క హీరోగా క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్న రాం చరణ్ నిర్మాతగా కూడా బిజీ బిజీగా ఉంటున్నాడు. ఒక హీరో తను చేస్తున్న ఒక సినిమా మీద దృష్టి పెట్టడమే ఎక్కువ అనుకుంటుంటే చరణ్ ప్రస్తుతం ఏకంగా నాలుగు సినిమాల మీద కాన్సెంట్రేట్ చేయాల్సి వస్తుంది. అదేంటి సెట్స్ మీద ఉన్న వినయ విధేయ రామ ఒక్కటే కదా చరణ్ చేస్తున్న మూవీ అనుకోవచ్చు. దానితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమా నిర్మాతగా బాధ్యతలను మీద వేసుకున్నాడు. ఆ సినిమాకు కావాల్సిన బడ్జెట్ కేటాయిస్తూ చిరు, సురేందర్ రెడ్డిల మధ్య ఎలాంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు చరన్.
1
ఇక మరో పక్క బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఎన్.టి.ఆర్ తో పాటుగా చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాపై కూడా రాం చరణ్ దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవన్ని అయ్యాక చిరు 152వ సినిమాగా చేస్తున్న కొరటాల శివ మూవీకి సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లు చరణ్ ఉన్నంత బిజీగా ఎవరు లేరని చెప్పొచ్చు.
2
బిజీ అవడం మంచిదే కాని సినిమాల క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉంటే మంచిది. సమయాభావం వల్ల సినిమా ఫీల్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడితే మంచిది. ముఖ్యంగా హీరో చేస్తున్న సినిమాల కన్నా నిర్మాతగా తను చేస్తున్న రెండు క్రేజీ ప్రాజెక్టులపై చరణ్ ఎక్కువ దృష్టి పెడుతున్నాడట. ఈ వయసులో ఇంత పెద్ద బాధ్యత తీసుకోవడం చరణ్ వల్లే సాధ్యమైంది. బోయపాటి శ్రీనుతో చేస్తున్న వినయ విధేయ రామ సినిమా 2019 సంక్రాంతి బరిలో ఉంది. ఈమధ్యనే వచ్చిన సినిమా టీజర్ మూవీపై అంచనాలు పెంచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news