Gossipsసినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. టాప్ సింగర్ కన్నుమూత

సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. టాప్ సింగర్ కన్నుమూత

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో ఈ రోజు ఉదయం ప్రముఖ సింగర్ టెంపో వ్యాన్ బోల్తా పడి మృతి చెందారు. సంగం మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మార్గం మధ్యలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిదిమంది సింగర్స్ తీవ్రంగా గాయపడ్డారు.నెల్లూరు కి చెందిన సుస్వర పాట కచేరి బృందం వారు కడప జిల్లా లో ఒక ప్రోగ్రాం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ముంబై జాతీయ రాహదారి వద్ద టెంపో వ్యాన్ ముందు టైర్ పగిలి పోవటం తో వ్యాన్ అదుపు తప్పి పక్కనే ఉన్న గుంత లో పడి బోల్తా కొట్టింది, వెంటనే గాయకుడూ మరియు డ్రైవర్ కిషోర్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ లో ఉన్న మహిళా కళాకారులూ తీవ్రంగా గాయపడ్డారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించారు, ఒక వాహనం లో ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరిలను తరలించగా మిగిలిన వారిని తీసుకు వెళ్ళటానికి మరో 108 వాహనం రావటానికి ఆలస్యం జరిగిందని స్థానికులు వివరించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news