Gossipsటాలీవుడ్ లో సినిమా రిలీజ్ అయ్యి 400 రోజులయ్యింది…అయినా క్రేజ్ తగ్గలేదు

టాలీవుడ్ లో సినిమా రిలీజ్ అయ్యి 400 రోజులయ్యింది…అయినా క్రేజ్ తగ్గలేదు

కొన్నాళ్లుగా మూస సినిమాలకే అంకితమైన ఎన్.టి.ఆర్ టెంపర్ నుండి తన పంథా మార్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ చేసిన ప్రతి సినిమా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. ఇక తారక్ కెరియర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా 85 కోట్ల కలక్షన్స్ తో విజయ డంఖా మోగించింది.

అయితే ఆ సినిమా తర్వాత 2017లో కూడా యంగ్ టైగర్ జై లవ కుశ అంటూ వచ్చి దుమ్ముదులిపేశాడని తెలిసిందే. ఇదిలా ఉంటే జనతా గ్యారేజ్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా నటించాడు. అందుకే కేరళలో కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా మంచి ఫలితాన్నే అందుకోగా అక్కడ ఇంకా జనతా గ్యారేజ్ ఫీవర్ పోలేదని తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కాకుండా కేరళ ప్రాంతంలో కూడా జనతా గ్యారేజ్ అంటూ మెకానిక్ షెడ్డులకు పేర్లు పెడుతున్నారట.

సినిమా రిలీజ్ అయ్యి 400 రోజులు కావొస్తున్నా ఎన్.టి.ఆర్ పేరు ఇంకా మలయాళంలో మారుమోగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్న తారక్ ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా చేస్తున్నాడు. అది కూడా తెలుగు భాషలోనే కాకుండా అన్ని సౌత్ భాషల్లో కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news