Moviesమిథాలీ రాజ్ బయోపిక్‌ కన్ఫం.. ఎవరు చేస్తున్నారో తెలుసా?

మిథాలీ రాజ్ బయోపిక్‌ కన్ఫం.. ఎవరు చేస్తున్నారో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా బయోపిక్‌ల హవా సాగుతోంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్, వైయస్ఆర్ లాంటి ప్రముఖుల జీవిత చరిత్రలను తెరకెక్కించగా అవి భారీ హిట్లుగా నిలిచాయి. కాగా తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితగాధను తెరకెక్కిస్తున్నారు. అటు క్రీడాకారుల బయోపిక్‌లలో ఎంఎస్ ధోనీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరో క్రికెటర్‌ జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.

మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పలు విజయాలను ఇండియా క్రికెట్ మహిళల టీమ్‌కు అందించిన మిథాలీ రాజ్ జీవిత చరిత్రను ‘శభాష్ మిథు’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో అందాల భామ తాప్సీ పన్ను మెయిన్ లీడ్‌లో నటించనుంది. దీనికి సంబంధించి తాప్సీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. మిథాలీ రాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను తాప్సీ అనౌన్స్ చేసింది.

మిథాలీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇవ్వలేను అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. రాయీస్ వంటి సినిమాను అందించిన రాహుల్ డోలాకియా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news