Gossipsమళ్ళీ సైరా కథ అడ్డం తిరిగిందా..?

మళ్ళీ సైరా కథ అడ్డం తిరిగిందా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా సైరా నరసింహారెడ్డి షురూ చేసిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడని ఎనౌన్స్ చేయగా సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది.

కాని మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ సైరా నుండి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ స్థానంలో తమన్ ఛాన్స్ కొట్టేశాడని అన్నారు. కాని అంత ప్రెస్టిజియస్ మ్యూజిక్ కు తమన్ న్యాయం చేయగలడా అన్న ఆలోచనలో ఉన్న చిత్రయూనిట్ సైరాకు కీరవాణిని తీసుకునే ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఎంత అసెట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మ్యూజిక్ తోనే బాహుబలిని మరో లెవల్ కు తీసుకెళ్లాడు కీరవాణి. అందుకే సైరా బాధ్యతలను కీరవాణి మీద పెట్టాలని ఆలోచిస్తున్నారట. కీరవాణి అందుకు ఓకే అంటే మాత్రం సైరాకు అదనపు ఆకర్షణ వచ్చినట్టే. పరుచూరి సోదరులు కథ అందించిన ఈ సినిమాకు సాయి మాధవ్ మాటలను అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను 2019 సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news