Newsగుట్టుచప్పుడు కాకుండా నిశ్చిత్తార్థం.. సోషల్ మీడియాలో వైరల్..

గుట్టుచప్పుడు కాకుండా నిశ్చిత్తార్థం.. సోషల్ మీడియాలో వైరల్..

కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ తెలుగులో కొన్ని సినిమాలు తీసి ఇక్కడ వివాదాలు ఏర్పడటంతో ముంబైకు చెక్కేసింది. 2002లోనే బాలనటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న శ్వేతా బసు ప్రసాద్ హిందిలో సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ కొనసాగించింది.

అనురాగ్ కశ్యప్ ఫాంటం ఫిలిమ్స్ లో స్క్రిప్ట్ కన్ సల్టెంట్ గా వర్క్ చేస్తూ ఆయన తీసిన షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఈ క్రమంలో శ్వేతాకు రోహిత్ మిట్టల్ అనే దర్శకుడితో పరిచ్యం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారిందట. గోవాలో ఆమె అతనికి ప్రపోజ్ చేయగా.. అతను ఆలోచించుకుని పూణేలో ఆమెకు ఓకే చెప్పాడట.

వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందట. తన పర్సనల్ విషయాలను ఏమాత్రం బయటపెట్టేందుకు ఇష్టం లేని శ్వేతా ఈ విషయాన్ని దాచి పెట్టిందట. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారట. హింది సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉన్న శ్వేతా ఈమధ్యనే తెలుగులో గ్యాంగ్ స్టర్స్ వెబ్ సీరీస్ లో కనిపించిందిs

ss

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news