Gossipsప్రేమలో మోసమే ఉంటుంది.. రోహిత్ రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తుంది..!

ప్రేమలో మోసమే ఉంటుంది.. రోహిత్ రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తుంది..!

ప్రేమించిన యువతి మోసం చేసిందని 21 సంవత్సరాల రోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన రోహిత్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గాంధీనగర్ కు చెందిన వ్యక్తి. అక్కడే ఉంటున్న యువతితో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. హుజూరబాద్ పిహెచ్సిలో హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్న రోహిత్ తో బిటెక్ చదివే అమ్మాయి ప్రేమలో పడింది.

ఇద్దరి ప్రేమ పెద్ద వాళ్లకు తెలిసింది. అయితే కులాలు వేరు కావడం వల్ల ఇద్దరిని కలవకుండా కట్టడి చేశారు. అయితే చిన్నగా ఆ అమ్మాయి మనసు కూడా మార్చడానికి ప్రయత్నించారు అమ్మాయి తరపున వాళ్లు. పేరెంట్స్ చెప్పిన మాటలకు ఆమె మనసు మార్చుకుంది. ఆమెను గాడంగా ప్రేమించిన రోహిత్ ఆమెని విడిచి ఉండలేక సూసైడ్ నోట్ రాసిమరి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొన్నాళ్ల క్రిందట తండ్రి మరణించడంతో తన తమ్ముళ్లకు అమ్మను సరిగా చూసుకోండి అంటూ సూసైడ్ నోట్ లో రాసి చనిపోయాడు రోహిత్. అంతేకాదు ప్రేమలో మోసం మాత్రమే ఉంటుందని కూడా చివరి మాటగా చెప్పడం అందరిని కన్నీళ్లు తెప్పించింది. రోహిత్ తమ్ముడు సాంశివ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news