Moviesమళ్లీ పుట్టిన అతిలోక సుందరి.. ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు!

మళ్లీ పుట్టిన అతిలోక సుందరి.. ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు!

అతిలోక సుందరిగా పేరు సంపాదించిన ఎవర్‌గ్రీన్ బ్యూటీ శ్రీదేవి తెలుగునాట ఎలాంటి ముద్ర మిగిల్చిందో అందరికీ తెలిసిందే. పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో కోట్లాది ప్రేక్షకుల మన్ననలు పొందింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ కూడా సూపర్ సక్సెస్ సాధించింది. కానీ దేవుడు చిన్నచూపు చూడటంతో కోట్లాది అభిమానుల మనసులను గాయపరుస్తూ ఈ సుందరి లోకాన్ని విడిచి వెళ్లింది. శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాగా ఇప్పుడు ఆమె మళ్లీ పుట్టిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

సింగపూర్‌లోని ప్రసిద్ధి చెందిన మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో నటి శ్రీదేవి విగ్రహాన్ని సెప్టెంబర్ 4న ఆవిష్కరించనున్నారు. కేవలం తన అందంతో కాకుండా నటనతో కోట్లాది ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాధించిన ఈ బ్యూటీ విగ్రహాన్ని ఆమె కూతురు జాన్వీ కపూర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. కాగా శ్రీదేవి విగ్రహం చూస్తే ఆమె మళ్లీ పుట్టిందంటున్నారు ఆమె ఫ్యాన్స్.

అభిమానులను విషాదంలో వదిలి వెళ్లిన శ్రీదేవి ఈ విధంగా తన అభిమానులు మరోసారి చేరువ కానుంది. అయితే ఈసారి శ్రీదేవిని చూడాలంటే మాత్రం సింగపూర్ దాకా వెళ్లాల్సిందే అంటున్నారు సినీ జనాలు. శ్రీదేవి లేకున్నా ఆమె విగ్రహాన్ని చూసి సంతోషిస్తామంటున్నారు ఆమె అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news