Moviesస్పైడర్ సెన్సార్.. మహేష్ చరిష్మా చూపిస్తాడట..!

స్పైడర్ సెన్సార్.. మహేష్ చరిష్మా చూపిస్తాడట..!

సూపర్ స్టార్ మహేష్ తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అనుకున్నట్టుగానే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది.

ఇక సినిమా మహేష్ చరిష్మాను తప్పక తెలియచేస్తుందని అంటున్నారు. మురుగదాస్ టేకింగ్ సినిమాకు హైలెట్ అవనుందట. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. విలన్ గా నటించిన సూర్య సైకోగా కనిపిస్తాడట. మురుగదాస్ అన్ని సినిమాల్లో లానే స్పైడర్ కూడా భారీతనంతో ఉంటుందట. సెన్సార్ నుండి ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన స్పైడర్ కు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో మహేష్ మొదటిసారి తమిళ మార్కెట్లోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news