Moviesబాహుబలి 3 పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

బాహుబలి 3 పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం బాహుబలి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల ఫ్లొరిడాలోని ఓర్లాండాలో జరిగిన ఎన్బీఏ బాస్కెట్ బాల్ పోటీల్లో కళాకారులు ”బాహుబలి” సినిమాలోని మమతల తల్లి మరియు సహోరే బాహుబలి పాటలకు నృత్యం చేసి అక్కడి ప్రేక్షకులని అలరించారు.

ఈ విధంగా ఒక తెలుగు సినిమాకి ఒక అంతర్జాతీయ వేదిక పైన ఇంత గౌరవం దక్కటం మనం అందరం ఎంతో సంతోషించాల్సిన విషయం. తాజాగా బాహుబలి మరో అవార్డును అందుకుంది. ఈ క్రమంలో ప్రముఖ న్యూస్ ఛానల్  సీఎన్ఎన్ ఐబీఎన్ బాహుబలి సినిమాకి ఇండియన్ మూవీ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎంపిక చేసారు. గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకలో ఈ చిత్రాన్ని ఇండియన్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా నటి రమ్యకృష్ణ, నిర్మాత యార్లగడ్డ శోభులు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు. 2015లో ఇదే అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకోగా, 2016కి గాను బాహుబలి సినిమాలో పనిచేసిన ఇతర నటీనటులు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ”బాహుబలి-3” వ భాగాన్ని తెరకెకించే ఆలోచన లేదని చెప్పారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ ఇండియన్ ఎపిక్ మూవీ బాహుబలిలో నటించటం ఎంతో అదృష్టమని ఈ అనుభూతి జీవితాంతం మదిలో గుర్తుండిపోతుందని తెలిపారు. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సుమారు 1,700 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news