Gossipsషకీలా @ 250.. శీలవతిలో సర్ ప్రైజ్ పక్కా..!

షకీలా @ 250.. శీలవతిలో సర్ ప్రైజ్ పక్కా..!

చాలాకాలం తర్వాత షకీలా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శీలవతి. కేరళలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ శీలవతి సినిమాను సాయిరాం దాసరి డైరెక్ట్ చేయగా రాఘవ ఎం. గణేష్, వీరు బాసింశెట్టి కలిసి నిర్మించారు. ఈ నెల 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో షకీలా సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియచేశారు.

తన కెరియర్ లో 250వ సినిమా ఇదని.. ఈ సినిమాతో తన ఇదవరకు ఇమేజ్ పూర్తిగా తొలగిపోతుందని.. దర్శకుడు ఈ సినిమాను చాలా సస్పెన్స్ గా తెరకెక్కించిన దర్శకుడు తన ప్రతిభ చాటుకుంటాడని అన్నారు. శీలవతి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని షకీలా అన్నారు. మరి శీలవతి తప్పకుండా షకీల ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుందని మాత్రం చెప్పొచ్చు. మరి ఆ సర్ ప్రైజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news