Gossipsఆమె గురించి నిజాలు బయటపెట్టిన శర్వానంద్..

ఆమె గురించి నిజాలు బయటపెట్టిన శర్వానంద్..

మళయాళ ప్రేమం సినిమాతో సౌత్ సిని ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ఫిదా అంటూ వచ్చి తెలుగు ఆడియెన్స్ ను మెప్పించింది. ఆ సినిమాతో సాయి పల్లవికి ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత ఎం.సి.ఏ సినిమా కూడా అమ్మడికి హిట్ ఇచ్చింది. నాగ శౌర్యతో చేసిన కణం నిరాశపరచినా లేటెస్ట్ గా పడి పడి లేచె మనసు సినిమాతో వస్తుంది ఈ అమ్మడు. హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా నటించింది సాయి పల్లవి.

ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడం జరిగింది. బన్ని బాబు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈమధ్య ఆయన వచ్చి టచ్ చేసిన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అలానే నా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా అని చెప్పాడు శర్వానంద్. ఇక హీరోయిన్ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తాడు శర్వానంద్. ఆమె గురించి వార్తలన్ని రూమర్సే అని.. ఆమె చాలా మంచి యాక్ట్రెస్ అని.. చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని అన్నాడు శర్వానంద్.

కణం సినిమా టైంలో నాగ శౌర్య, సాయి పల్లవిల మధ్య క్లాష్ అందరికి తెలిసిందే. నాగ శౌర్య డైరెక్ట్ గానే సాయి పల్లవిపై కామెంట్స్ చేశాడు. ఫైనల్ గా శర్వానంద్ క్లియరెన్స్ తో సాయి పల్లవి యాటిట్యూడ్ పై అందరి డౌట్ తీరింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తన మీద వస్తున్న రూమర్స్ ను ఆపలేకపోయింది. శర్వానంద్ మాత్రం అమ్మడికి క్లీన్ చిట్ ఇచ్చేశాడు. డిసెంబర్ 21న పడి పడి లేచే మనసు రిలీజ్ అవుతుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా యువతను మెప్పించేలా కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news