Gossipsజక్కన అంతు చూస్తానంటున్న అర్జున్ రెడ్డి డైరక్టర్..

జక్కన అంతు చూస్తానంటున్న అర్జున్ రెడ్డి డైరక్టర్..

అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించిన సందీప్ వంగ ప్రస్తుతం ఆ సినిమా హింది రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ రెండేళ్ల సరిపడా డేట్స్ లాక్ అయ్యాయి కాబట్టి కబీర్ సింగ్ తర్వాత సందీప్ వంగ ఓ క్రైం డ్రామా సినిమా చేస్తాడని తెలుస్తుంది. అది కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ గా తీర్చిదిద్దుతాడట. ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో చేస్తాడట సందీప్ వంగ.

కంటెంట్ బాగుంటే బాషతో సంబంధం లేకుండా సినిమాలు ఆడుతాయని.. అందుకే తన తర్వాత సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నాడు సందీప్ వంగ. కబీర్ సింగ్ ఫలితాన్ని బట్టి తెలుగు, తమిళ, హింది భాషల్లో తన క్రైం డ్రామా మూవీ చేస్తాడట. మహేష్ బాబు సినిమా కూడా ఉంటుందని ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని.. సినిమా కచ్చితంగా ఉంటుందని అంటున్నాడు సందీప్ వంగ. ఇక తన మొదటి సినిమా హిట్ అవడం వల్ల తన కొడుకు పేరు అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నానని చెప్పాడు సందీప్ వంగ.

కంటెంట్ ఉన్న సినిమా బాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఆడేస్తుందని గట్టిగా చెబుతున్నాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ లో షాహిద్ కపూర్, కియరా అద్వాని హీరో హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందిలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. జూన్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news