Gossipsరిలీజ్ కు ముందే సాక్ష్యంకు ఎదురుదెబ్బ..!

రిలీజ్ కు ముందే సాక్ష్యంకు ఎదురుదెబ్బ..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సాక్ష్యం. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రిలీజ్ ముందే ఎదురుదెబ్బ పడ్డది. ఈరోజు రిలీజ్ అవుతున్న సాక్ష్యం మార్నింగ్ షో క్యాన్సిల్ అయ్యింది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సాక్ష్యం మార్నింగ్ షో క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రసాద్ ల్యాబ్ లో మీడియా వాళ్లకు వేయాల్సిన 8.45 షో కూడా క్యాన్సిల్ చేశారట. పంచభూతాల సహకారంతో తన పగ తీర్చుకునే కుర్రాడి కథే సాక్ష్యం మూవీ కథ. బడ్జెట్ పరిమితులు లేకుండా వచ్చిన ఈ సినిమా రిలీజ్ నాడే మొదటి షో పడకపోవడం బ్యాడ్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. 3 వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనుకపడ్డ బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి సాక్ష్యంతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news