Gossipsసాక్ష్యం మొదటి షో టాక్.. మళ్లీ దెబ్బ పడ్డదా..!

సాక్ష్యం మొదటి షో టాక్.. మళ్లీ దెబ్బ పడ్డదా..!

బెల్లంకొండ శ్రీనివాస్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సాక్ష్యం. తన మార్కెట్ ఏంటో కూడా తెలిసినా ఈ సినిమాలు భారీ బడ్జెట్ కేటాయించారు. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సాక్ష్యం మూవీ ఆ అంచనాలను అందుకోవడంలొ మళ్లీ విఫలమైందని అంటున్నారు. మొదటి షో టాక్ ప్రకారం పేరెంట్స్ ను చంపిన వారిని హీరో పంచభూతాల సాక్ష్యంతో కనిపెట్టి వారిని చంపేస్తాడు.

అయితే ఈ పంచభూతాల కాన్సెప్ట్ ఆడియెన్స్ ను కన్విన్స్ చేయడంలో దర్శకుడు శ్రీవాస్ కొంతమేరకు ఓకే అనిపించినా బెల్లంకొండ ఓవర్ యాక్షన్ వల్ల సినిమా మళ్లీ నిరాశపరచిందని అంటున్నారు. అంతేకాదు పూజా హెగ్దెని సరిగా వాడుకోలేదని తెలుస్తుంది. డిజేలో బికినితో దుమ్మురేపిన పూజా ఈ సినిమాలో స్కిన్ షోకి తావివ్వలేదు.

మరి మొదటి షో టాక్ చూస్తే సినిమా మళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ ఖాతాలో మరో ఫ్లాప్ యాడ్ అయ్యిందని అంటున్నారు. మరి అసలు ఒరిజినల్ టాక్ ఎంటన్నది ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news