Gossipsమూగ పాత్రకు ఒకే చెప్పిన 'మెగా' హీరో ?

మూగ పాత్రకు ఒకే చెప్పిన ‘మెగా’ హీరో ?

ఆ మధ్య కొంతకాలం క్రితం మెగా హీరో రాంచరణ్ తేజ చెవిటివాని పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాదు జీవించేసాడు. రంగస్థలం లో చెర్రీ పాత్రకు ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు వచ్చిపడ్డాయి. చెవిటివాని పాత్రలో చెర్రీ నటించడం ఏంటి అని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ బ్లాక్ బ్లాస్టర్ డైరెక్టర్ సుకుమార్ సినిమా కావడంతో అందులో ఏదో స్పెషలిటీ తప్పకుండా ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్టుగా ఆ పాత్ర బాగా హిట్ అయ్యి సినిమాకు కూడా బాగా దోహదం చేసింది.

అయితే ఇప్పుడు మరో మెగా హీరో అటువంటి పాత్రనే ఎంచుకుని అందరికి షాక్ ఇచ్చాడు. అటువంటి పాత్ర అంటే చెవిటివాడిగా కాదు సుమ ! మూగవాని పాత్రలో చేయబోతున్నాడు. మెగా మేనల్లుగు సాయితేజ్ (సాయి ధరమ్ తేజ్) తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కుతోంది.

కాకపోతే ఈ సినిమాలో హీరో మాటలు రాని జాలరి పాత్రలో వైష్ణవ తేజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన మొదటి సినిమాతోనే ఓ ఛాలెంజింగ్ రోల్ లో వైష్ణవ్ తేజ్ నటిస్తుండడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ మెజీషియన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మలయాళీ భామ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news