Newsరంగస్థలం అరాచకం మొదలైంది.. మెగా పవర్ చూపించే టైం వచ్చింది..!

రంగస్థలం అరాచకం మొదలైంది.. మెగా పవర్ చూపించే టైం వచ్చింది..!

రాం చరణ్, సుకుమార్ మొదటిసారి కలిసి చేస్తున్న సినిమాగా రంగస్థలం ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించింది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వెళ్తున్న ఈ సినిమా మ్యాక్సిమం థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో రంగథలం మూవీ 650 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుండగా.. కర్ణాటక, చెన్నై, బెంగళూరు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మరో 200 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట.

ఇక యూఎస్, యూకె, యూఏఈ కలిసి అటు ఇటుగా మరో 350 సెంటర్స్ లో ఈ మూవీ వస్తుందట. ఎలా లేదన్నా ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం సినిమా 1200 థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంతేకాదు సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ నాడు ఒక్కటి, రెండు లేదా వారం రోజులు కూడా అదనపు థియేటర్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట.

చూస్తుంటే రాం చరణ్ కెరియర్ లో ఎన్నడు లేని విధమా భారీ వసూళ్లను రాబట్టగలిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news