Gossips"ఆటోజానీ"గ వస్తున్న రాం చరణ్..!

“ఆటోజానీ”గ వస్తున్న రాం చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ మూవీగా ఖైది నంబర్ 150 సినిమా చేశాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన కత్తి సినిమా రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను రాం చరణ్ నిర్మించారు. అయితే ఆ సినిమా తర్వాత చిరు సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. చిరు రీ ఎంట్రీ టైంలోనే పూరి జగన్నాథ్ ఆటో జానీ కథ వినిపించాడు.

సినిమా లైన్ నచ్చినా.. ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించినా.. సెకండ్ హాఫ్ విషయంలో కొద్దిగా ఆలోచనలో పడటంతో సినిమా పట్టాలెక్కలేదు. చిరుతో సినిమా అనుకున్న పూరి ఆశ నెరవేరలేదు. అయితే ఆటో జానీ కథ విన్న చరణ్ ఆ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. చిరు చేయకున్నా సరే పూరితో ఆటో జానీ చరణ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం పూరి కూడా రాం తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే రిలీజైన ఇస్మార్ట్ శంకర్ టీజర్ ఇంప్రెస్ చేసింది. పూరి సత్తా చాటేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ హిట్టైతే మాత్రం పూరి రాం చరణ్ సినిమా కన్ఫాం అయినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news