Newsఆ విషయంలో వర్రీ అవుతున్న చెర్రీ !

ఆ విషయంలో వర్రీ అవుతున్న చెర్రీ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ విషయంలో చాలా వర్రీ అవుతున్నాడు. ఈ మధ్య విడుదల అయిన వినయవిధేయరామ సినిమా బాక్సపీస్ వద్ద బోర్లా పడడం చెర్రీని నిరాశపరిచింది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ లో ప్లాప్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎందుకంటే… ఎన్నో భారీ సినిమాలకు దర్శకత్వం వహించి… భారీ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అందరి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయ్యింది.

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా ఫలితం మెగా అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరచడంతో… చెర్రీ ఇప్పుడు స్పందిస్తున్నాడు. ఈ సందర్భంగా … ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు. ప్రియమైన అభిమానులకు , ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించి పనిచేసిన సాంకేతిక నిపుణులకు,పంపిణీ దారులకు, ప్రదర్శన దారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వినయ విధేయ రామ సినిమాతో మీ అందరిని అలరిస్తానని భావించాను. కాని దురదృష్టవశాత్తు మీకు మంచి సినిమాను అందించలేక పోయాము. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాము. భవిష్యత్తులో మీకు నచ్చే,మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.

మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను. అన్నివేళలా తమ మద్దతును అందించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు అంటూ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు రామ్ చరణ్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news