Moviesఎన్టీఆర్ ఫాన్స్ కి రాఖీ రోజున షాక్ ఇవ్వనున్న జై సెకండ్...

ఎన్టీఆర్ ఫాన్స్ కి రాఖీ రోజున షాక్ ఇవ్వనున్న జై సెకండ్ రోల్…

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా గురించి ఎలాంటి చిన్న వార్త అయినా సంచలనమే అని చెప్పాలి. జై పాత్ర రివీల్ చేసిన విధానం సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడని తెలిసిందే. జై కుమార్ తో పాటుగా లవ కుమార్, కుశల్ కుమార్ గా తారక్ నటిస్తున్నాడు. రెండో పాత్ర లవకుమార్ ఆగష్టు 7న రాఖి రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆగష్టు 7 ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఎన్.టి.ఆర్ లవకుమార్ గా దర్శనమిస్తాడు.

ఈ విషయం తెలిసిన దగ్గర నుండి ఫ్యాన్స్ లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట. ఇప్పటికే సినిమాలోని సాంగ్ గా లీక్ అయిన రావణా శక్తి శాసనా అనే సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమా ప్రబ్లిసిటీని భారీగా చేస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21 నుండి ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి.

DGRzopqUwAEpoUA

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news