Gossipsమల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కు అన్యాయం..?

మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కు అన్యాయం..?

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇద్దరు హీరోలను అదే రేంజ్ లో హ్యాండిల్ చేయగల సత్తా రాజమౌళికి ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సంచలనంగా మారుతుంది.

లేటెస్ట్ గా ఈ సినిమాలో రాం చరణ్ పోలీస్ గా.. తారక్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ వార్తలని బట్టి చూస్తే తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇది కచ్చితంగా ఎన్.టి.ఆర్ కు చేస్తున్న అన్యాయమే అని అంటున్నారు ఫ్యాన్స్. రాం చరణ్ పోలీస్ గా అంటే హీరోగా.. తారక్ ను విలన్ గా చూపిస్తున్నారని అంటున్నారు.

అయితే సినిమా నిర్మాత డివివి దానయ్య మాత్రం సినిమా కథ గురించిన విషయాలు మరో నెలలో కన్ఫాం చేసే అవకాశం ఉందని.. మిగతా స్టార్ కాస్ట్ కూడా అప్పుడే వెళ్లడిస్తామని చెప్పారు. మరి వినిపిస్తున్న వార్తలన్ని రూమర్లే అన్నట్టుగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news