Moviesక్రిష్‌కు ఫోన్ చేసి.. ఖంగుతినిపించిన దర్శకుడు రాజమౌళి

క్రిష్‌కు ఫోన్ చేసి.. ఖంగుతినిపించిన దర్శకుడు రాజమౌళి

After tweeted on Gautamiputra Satakarni Trailer, tollywood ace director Rajamouli called Krish and appreciated him for showing outstanding output in just 8 months of span time.

ఓ స్థాయిలో ఉన్న దర్శకులు సాధారణంగా ఎలాంటి విషయాలపై త్వరగా స్పందించరు. ఏం చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా ఆచితూచి అడుగులు వేస్తారు. అలాకాకుండా ఠక్కున రెస్పాండ్ అయితే మాత్రం.. అందులో ఏదో ఓ ప్రత్యేకత ఉంటుందని, వారు దానికి ఫిదా అయిపోయి ఉంటారని అర్థం చేసుకోవాల్సిందే. ఆ ఎగ్జైట్‌మెంట్‌ని తట్టుకోలేక.. అప్పటికప్పుడు తమ ఫీలింగ్‌ని బయటపెట్టేస్తారు. ఇలాంటివారి జాబితాలో ముందుగా వినిపించేది దర్శకధీరుడు రాజమౌళి పేరే.

వరుస విజయాలో తిరుగులేని డైరెక్టర్‌గా పేరుగాంచిన జక్కన్న.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ రిలీజైన వెంటనే అది అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. 8 నెలల్లోనే అద్భుతమైన ఔట్‌పుట్ తీసుకొచ్చావంటూ దర్శకుడు క్రిష్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు.. అతనికి నేరుగా ఫోన్ కూడా చేశాడట. ట్రైలర్ అదిరిపోయిందని, ఔట్‌పుట్ క్వాలిటీ కళ్లుచెదిరేలా ఉందని కొనియాడాడట. 50 కోట్ల బడ్జెట్‌లోపు 80 రోజుల్లోనే ఇంత గ్రేట్ వర్క్ చేసినందుకు క్రిష్‌కి హ్యాట్సాఫ్ చెప్పాడట. అలాగే.. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెంచేశావని, వాటిని రీచ్ అయ్యేందుకు మరింత కష్డపడాలని, వీలైనంత వరకు శ్రమించు అంటూ సలహాలు కూడా ఇచ్చాడట.

ఈ విధంగా రాజమౌళిలాంటి గొప్ప దర్శకుడి నుంచి తనకు ఫోన్ రావడంతో క్రిష్ ఉబ్బితబ్బిబయ్యాడని తెలుస్తోంది. కేవలం రాజమౌళినే కాదు.. మరెందరో ప్రముఖులు ఈ ట్రైలర్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు కూడా వెల్లడిస్తున్నారు. ట్రైలర్‌తో ఓ రేంజులో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం కోసం ప్రతిఒక్కరూ ఎంతగానో వేచి చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news