Gossipsపోసానికి ఏమైంది?!

పోసానికి ఏమైంది?!

టాలీవుడ్ లోకి రచయితగా ఎంట్రీ ఇచ్చి..తర్వాత దర్శకుడిగా, నటుడిగా తన సత్తా చాటుతున్నాడు పోసాని కృష్ణ మురళి. ఆయన ఛానల్స్ ముందుకు వస్తే..ఏ విషయం అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడుతాడు. ఈ మద్య రాజకీయాల్లో బిజీగా ఉంటుంన్న పోసాని టీడీపీ ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. జగన్ కి తాను వీరాభిమానినని ఆయన సహనం..త్యాగం చాలా గొప్పదని మాట్లాడుతున్నాడు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ మద్య దారుణంగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో టీపీపీ శ్రేణులు ఈసికి ఫిర్యాదు చేయగా ఆయకు నోటీసులు పంపి అర్జంట్ గా తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పోసాని యశోదా ఆసుపత్రిలో తన మోకాలికి ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం నోటీసులపై పోసాని కృష్ణమురళి స్పందించారు.

సీఎం చంద్రబాబు పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని..ప్రస్తుతం తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకుంటున్నానని.. తాను నడవలేని పరిస్థితిలో ఉన్నానని, ఆపరేషన్‌ కోసం యశోదా ఆస్పత్రిలో చేరానని తెలిపారు. అలాగే మెడికల్ రిపోర్ట్స్ సైతం ఆ లెటర్ క కలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news