Moviesకురుక్షేత్రం యుగానికి ఒక్కసారే.. " పంతం " ట్రైలర్ అదుర్స్..!

కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే.. ” పంతం ” ట్రైలర్ అదుర్స్..!

మాస్ హీరో గోపిచంద్ చక్రవర్తి డైరక్షన్ లో చేస్తున్న సినిమా పంతం. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తోనే సినిమాలోని దమ్ము ఏంటో చూపించారు. కథ రొటీన్ గా అనిపిస్తున్నా గోపిచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

ముఖ్యంగా గోపిచంద్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ సినిమాకు హైలెట్స్ అవనున్నాయి. మెహెరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజకీయ నాయకుల మీద కన్నెర్ర చేసిన ఓ యువకుడి కథగా పంతం రాబోతుంది.

చూస్తుంటే ఈ సినిమా గోపిచంద్ పంతం నెగ్గే హిట్ కొట్టేలానే ఉంది. తొలి సినిమా అయినా చక్రవర్తి టీజర్, ట్రైలర్స్ తో తన పనితనం చూపించాడు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news