Moviesపంతం టీజర్ టాక్.. గోపిచంద్ ఈజ్ బ్యాక్..!

పంతం టీజర్ టాక్.. గోపిచంద్ ఈజ్ బ్యాక్..!

హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విలన్ గా మారి క్రేజ్ సంపాదించాక మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపిచంద్. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన హిట్లు లేక వెనుకపడ్డ గోపిచంద్ ప్రస్తుతం పంతం సినిమాతో వస్తున్నాడు. చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే తెలుస్తుంది.

మాస్ ఫాలోయింగ్ ను కాదని కొత్తగా కామెడీ ఎంటర్టైనర్స్ ట్రై చేసిన గోపిచంద్ మళ్లీ తన మార్క్ కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు. ఇక సినిమా టీజర్ చూస్తె ఇదేదో పొలిటికల్ సెటైర్ అన్నట్టు తెలుస్తుంది. మెహెరీన్ కౌర్ గ్లామర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సినిమాకు ప్లస్ అవ్వనున్నాయి. టీజర్ అయితే ఇంప్రెస్ చేయగా సినిమా గోపిచంద్ ను హిట్ ట్రాక్ ఎక్కించేస్తుందని అంటున్నారు.

ఇక ఈసారి యాక్షన్ సీక్వెన్సెస్ మీద మరింత దృష్టి పెట్టిన గోపిచంద్ మళ్లీ తన మాస్ ఇమేజ్ ను తిరిగి తెచ్చుకునేలా ఉన్నాడు. గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సత్య సాయి ఆర్ట్స్ లో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news