Newsనెత్తురు చిమ్మిన ఔటర్ రింగ్ రోడ్డు.. మృతుల వివరాలు మరియు ఫోటోలు!!

నెత్తురు చిమ్మిన ఔటర్ రింగ్ రోడ్డు.. మృతుల వివరాలు మరియు ఫోటోలు!!

ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం 8మంది బీటెక్ విద్యార్థుల ప్రాణాలు తీసింది. బుధవారం తెల్లవారుఝామున హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన ప్రమాదం అందరిని కలచివేసింది. స్నేహితురాలి పెళ్లికని తొమ్మిది విద్యార్థులు టవేరా వాహనంలో బయల్దేరారు. అంతా సరదాగా మాట్లాడుకుంటూ.. జోకులేసుకుంటూ ప్రయాణం సాఫీగానే సాగుతూ ఔటర్ చేరుకుంది. అక్కడే టోల్ గేట్ దగ్గర అన్ని వాహనాల వెనుక వీళ్ల వాహనం ఆపారు. ఇంతలోనే వెనకనుంచి మృత్యుశకటంలా వచ్చిన ఓ డీసీఎం టవేరాను గుద్దేసింది. అంతే ముందున్న లారీ.. వెనుకనుంచి డీసీఎం మధ్యలో టవేరా నుజ్జునజ్జైంది. దీంతో స్పాట్ లోనే 8మంది స్టూడెంట్స్ చనిపోయారు. మిగిలిన ఒక్కరి పరిస్థితి సీరియస్ గా ఉంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారి గ్రామం దగ్గర జరిగిందీ ఘటన.

మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన విద్యార్థులు వీళ్లంతా. వీళ్లను మహ్మద్ అఖిల్ (19), ఇమ్రోజ్ (25) షఖావత్ (30), ఇఫ్రాన్ (18), ఫిరోజ్ (22), నిషాద్ (24), అక్బర్ (28)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ అబ్బాస్ కు గాంధీ హాస్పిటల్ లో చికిత్స జరగుతోంది. ఇంకా ఒకళ్లని గుర్తించాల్సి ఉంది.

0a15c014-61b9-49bc-b4d5-44bdd09607e0

3ea81a81-154c-47db-a951-6c4b731cda31

5bc00718-e8a8-4672-8043-15f3d0a1ad23

7a76691f-a1da-4da5-b858-4c0f2da36df9

8b6077cf-fb32-4374-82d6-3e1e4c6e1e89

281eb55e-a856-434e-878b-1c748709dfe4

c602f1da-b66b-4470-a96c-c41ceea4f6b7

f8529e19-4436-4cf6-b1e4-9c01f17f855d

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news