Gossipsఎన్టీఆర్ 28.. కాంబో ఫిక్స్ అయ్యింది.. త్రివిక్రం, తారక్ సినిమా సెన్సేషన్..!

ఎన్టీఆర్ 28.. కాంబో ఫిక్స్ అయ్యింది.. త్రివిక్రం, తారక్ సినిమా సెన్సేషన్..!

అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా ముహుర్తం పెట్టుకున్న సంగతి తెలిసిందే. మార్చిలో మొదలవనున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో కె. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె తో పాటుగా శ్రద్ధ కపూర్ కూడా హీరోయిన్ గా ఓకే చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుద్ ప్లేస్ లో తమన్ సెలెక్ట్ అవగా.. ఫైనల్ కాస్ట్ అండ్ క్రూ ఇదే అని మ్యాటర్ రివీల్ అయ్యింది. సాహోతో శ్రద్ధా కపూర్, డిజేతో పూజా ఇద్దరు క్రేజీగా మారనున్నారు. మరి ఈ ఇద్దరితో తారక్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఇయర్ దసరా కు ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం సత్తా చాటేలా ఈ సినిమా కథ, కథనాలను రచిస్తున్నారట. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news