Gossipsఅరవ మేళానికి టాటా చెప్పేసిన ఎన్టీఆర్.. ఎవరిని తీసుకున్నాడో తెలుసా?

అరవ మేళానికి టాటా చెప్పేసిన ఎన్టీఆర్.. ఎవరిని తీసుకున్నాడో తెలుసా?

Young tiger NTR planning to take Devi Sri Prasad as music director for his 27th project by removing Anirudh Ravichander.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న 27వ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్న తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ని పక్కనపెట్టారట. అతని స్థానంలో రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ని తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు స్వయంగా తారకే నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఉన్నట్లుండి అనిరుధ్‌ని ఎందుకు పక్కనపెట్టారనేగా మీ సందేహం..? అందుకు ఓ బలమైన కారణం ఉంది.

అదేంటంటే.. ప్రస్తుతం అనిరుధ్ తమిళంలో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటు తెలుగులోనూ పవన్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి అతను ట్యూన్స్ అందిస్తున్నాడు. ఇలా వరుస మూవీలతో అనిరుధ్ బిజీబిజీగా ఉండడంతో.. తారక్ ప్రాజెక్ట్‌కి డేట్స్ కేటాయించలేకపోతున్నాడట. దీంతో.. తమ సినిమాకి అతను ట్యూన్స్ అందించడం ఆలస్యం అవుతుందన్న భావనతో అనిరుధ్‌ని తారక్ వద్దనుకున్నాడట. అతని స్థానంలో తన హాట్ ఫేవరేట్ దేవిశ్రీప్రసాద్‌ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

కాగా.. ఈ సినిమాని తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం పోషించనున్నాడని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news