Gossipsబయోపిక్ కు ఓవర్సీస్ లో షాకింగ్ ఆఫర్..!

బయోపిక్ కు ఓవర్సీస్ లో షాకింగ్ ఆఫర్..!

ఎన్ బీ కె ఫిలిమ్స్ ,సిసిఎల్ విష్ణు , సాయి కొర్రపాటి, సంయుక్తంగ నిర్మిస్తున్న NTR బయోపిక్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే . డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి అప్పుడే ముఖ్య పాత్రల్లో నటీనటులను ఎంపిక మొదలుపెట్టేసారు . ఎన్టీఆర్ పాత్ర లో బాలయ్య నటిస్తుండగా , ఎన్టీఆర్ భార్య పాత్ర బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు . ఇక ఎన్టీఆర్ సినీజీవితం లో ముఖ్యులైన నాగి రెడ్డి గారి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు , సీనియర్ నటుడు నరేష్ బీ ఏ సుబ్బారావు గా, కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తున్నారు . ఇలా స్టార్ కాస్టింగ్ లో నిమగ్నమయ్యారు దర్శకులు క్రిష్.
వీటన్నింటి మధ్య చిత్రానికి మంచి హైప్ రావడంతో అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యిపోయింది అప్పుడే . ఇంకా ఫస్ట్ షెడ్యూల్ క్లోజ్ అవ్వకుండానే ఓవర్సీస్ రైట్స్ కోసం పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థాలు పోటీపడుతున్నట్టు సమాచారం. ఒక ప్రముఖ సంస్థ సుమారు 12 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు ఇండస్ట్రీ లో టాక్ . అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా వారి నిర్ణయం ప్రకటించాక పోవడం కోసం మెరుపు. 2019 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం పై ఇటు ప్రేక్షకుల్లో అటు సినీ వర్గాలలో భారీ అంచనాలే వున్నాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news