Moviesఎన్టీఆర్ 27వ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్.. జాక్‌పాట్ కొట్టేసిన యంగ్...

ఎన్టీఆర్ 27వ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్.. జాక్‌పాట్ కొట్టేసిన యంగ్ భామలు!

According to industry sources, Niveda Thomas and Rashi Khanna are finalised as heroines in NTR 27 movie. Kalyan Ram producing this film under NTR Arts banner and Bobby handling this project.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ 27వ సినిమా తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇందులో హీరోయిన్లు కూడా ఫిక్స్ అయ్యారని వార్తలొచ్చాయి. తారక్ త్రిపాత్రాభినయం పోషిస్తుండగా.. ఒక్కొక్క క్యారెక్టర్ సూటయ్యేలా ముగ్గురు కథానాయికల్ని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. కానీ.. అవన్నీ రూమర్లేనని కళ్యాణ్ వెల్లడించారు. హీరోయిన్ల కోసం తాము కొందరిని పరిశీలిస్తున్నామని, ఫైనల్ చేయగానే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వారి వేట ముగిసినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్ సరసన కథానాయికలుగా నివేదా థామస్, రాశీఖన్నాలను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తారక్ చేయబోయే మూడు పాత్రల్లో రెండు పాత్రలకుగాను ఈ ఇద్దరు భామలు సరిగ్గా సరిపోతారని, అందుకే వారిని ఫైనలైజ్ చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే.. ఆ ఇద్దరి భామలు జాక్‌పాట్ కొట్టేసినట్లే. ఈ సినిమాతో వాళ్లు టాప్ పొజిషన్ కొట్టేయడం ఖాయమని అంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కళ్యాణ్ ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా.. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌పై కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీ లాంఛనంగా ప్రారంభం అవుతుండగా.. 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

niveda-tharak-rashi

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news