Moviesటార్గెట్ సాహో అంటున్న నార్త్ మీడియా..!

టార్గెట్ సాహో అంటున్న నార్త్ మీడియా..!

బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మీడియాను తనవైపు తిప్పుకుంది తెలుగు సినిమా. అయితే నార్త్ ఇండియా మీడియా మాత్రం ఇది జీర్ణించుకోలేకపోయిందని చెప్పాలి. ఎప్పుడూ సౌత్ ఇండియన్ మూవీస్‌ను చులకనగా చూసే నార్త్ ఇండియా ఈ సారి తన టార్గెట్‌ను సాహోపై సెట్ చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇందులో కూడా హీరో మన డార్లింగ్ ప్రభాసే!

ఇటీవల తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్)ను నార్త్ ఇండియా మీడియా టార్గెట్ చేసి ఆ సినిమాపై నానా హంగామా చేశారు. దీంతో ఆ సినిమా కలెక్షన్స్‌ను దెబ్బతీయాలని చూశారు. కానీ వారి పప్పులు ఉడకలేదు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎవరైనా ఆదరిస్తారు అని ప్రూవ్ చేశారు బాలీవుడ్ జనాలు. ఇక ఇప్పుడు వారు సాహో సినిమాపై పడ్డారు. ప్రభాస్ ఆల్రెడీ బాహుబలితో బాలీవుడ్ రికార్డులను పాతర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాహోతో కూడా సేమ్ ఫీట్ చేస్తాడేమో అని నార్త్ మీడియా ఈ సినిమాపై ఫోకస్ పెట్టింది. రిలీజ్ రోజున ఈ సినిమాను ఎలా దెబ్బతీయాలా అని నానా కుట్రలు పన్నుతున్నారట. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఏమాత్రం తొందర పడ్డ నష్టపోవాల్సింది సాహో చిత్రమే అని సినీ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన సాహోలో కనిపించే మెజారిటీ వాళ్లు బాలీవుడ్ యాక్టర్లే. అయినా అందులో మెయిన్ లీడ్ చేసింది.. సినిమాను డైరెక్ట్ చేసింది తెలుగోళ్లు కాబట్టి వారు అంతగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని అంటున్నారు సినీ క్రిటిక్స్. మరి నార్త్ ఇండియా మీడియా సాహోను ఏ రూపంలో టార్గెట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news