Moviesసెన్సార్ పూర్తి చేసుకున్న సందీప్ హార్రర్ మూవీ

సెన్సార్ పూర్తి చేసుకున్న సందీప్ హార్రర్ మూవీ

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నిన్ను వీడని నీడను నేను’ హార్రర్ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులను పోస్టర్స్, టీజర్స్‌తో బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్‌లో దూసుకుపోతోంది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమాలో చాలా పాజిటివ్ విషయాలు సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కథ, కథనం, చిత్ర టేకింగ్ అద్భుతమని వారు అన్నారట. ఇక ఈ సినిమాలో ఉండే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ సినిమా చూస్తేనే పొందవచ్చని వారు అన్నారు. ముఖ్యంగా సందీప్ కిషన్ నటన ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ పీక్స్ అని సెన్సార్ సభ్యులు థ్రిల్లింగ్ అనుభవాన్ని చిత్ర యూనిట్‌తో పంచుకున్నారట. జూలై 12న రిలీజ్ కానున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news