Gossipsపవన్ సినిమాపై వివాదాలలో మైత్రీ నిర్మాతలు..

పవన్ సినిమాపై వివాదాలలో మైత్రీ నిర్మాతలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు. తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించారు. ఇకపై పవన్ సినిమాల్లో నటించరు అనే టాక్ రావడంతో రకరకాల కధనాలు వస్తున్నాయి. అంతకు ముందే… టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతోన్న మైత్రీ మూవీ మేకర్స్ వారు చాలా మంది హీరోలకి, దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చారు. దాదాపు ఈ బ్యానర్ లో పది సినిమాలు లైన్ లో ఉన్నాయని నిర్మాతలే చెబుతున్నారు.

అయితే… మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందట. కానీ పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో.. ఆ కథని రవితేజతో చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి పవన్ నుండి అనుమతి కూడా తీసుకున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చెప్తున్నారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఊడడం వలన ఆయన ఇక సినిమాలు చేయరని ఉద్దేశంతో ఆయనకు ఇచ్చిన అడ్వాన్స్ సొమ్ములను వెనక్కి ఇచ్చేయాల్సిందిగా పవన్ ని నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ లు కోరారని ఫిలిం నగర్ లో టాక్ వినిపించింది.

అయితే అదంతా వట్టి పుకార్లేనని … పవన్ ని తాము అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమని అడగలేదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఎన్నికల అనంతరం తమ బ్యానర్లో ఖచ్చితంగా పవన్ తో సినిమా ఉంటుందని , అనవసర పుకార్లు నమ్మవద్దు అంటూ వారు స్ప్రష్టం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news