Gossipsపూరి కొడుకుతో యుద్ధమా..?

పూరి కొడుకుతో యుద్ధమా..?

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా మెహబూబా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఈ సినిమా కథ ప్రధానంగా పునర్జన్మల నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగిన కాలంలో చనిపోయిన ప్రేమజంట తిరిగి ఈ కాలంలో జన్మించటం, వారిద్దరూ తిరిగి ఎలా కలుసుకున్నారు, దేశం కోసం ఎం చేసారు అనే అంశాలతో ఈ చిత్రం సాగనుందట. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరి తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news