Gossipsమన్మథుడు 2 మొదలు పెట్టాడు.. మాటపై నిలబడ్డ నాగ్..!

మన్మథుడు 2 మొదలు పెట్టాడు.. మాటపై నిలబడ్డ నాగ్..!

కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన మన్మథుడు సినిమా సీక్వల్ గా ఓ సినిమా మొదలు కానుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. చిలసౌ సినిమాతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని అన్నారు. చిలసౌ చూసిన నాగ్ రాహుల్ డైరక్షన్ కు ఇంప్రెస్ అయ్యాడట. అందుకే తనని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అయితే నాగార్జున ఇచ్చిన మాట మీద నిలబడి రాహుల్ తో సినిమా మొదలు పెట్టారు.

మన్మథుడు సీక్వల్ గా మన్మథుడు-2 గా ఈ సినిమా మొదలు పెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ చైతుతో నటించిన రకుల్ నాగ్ తో జోడీ కడుతుంది. ఒకప్పుడు ఏయన్నార్, నాగార్జులతో శ్రీదేవి నటించింది. ఈమధ్యనే చిరు, చరణ్ లతో కాజల్ కలిసి జత కట్టింది. వారి దారిలో రకుల్ చైతుతో చేసి ఇప్పుడు నాగార్జున సరసన నటిస్తుంది. స్క్రిప్ట్ దశలోనే చాలా మార్పులు చేసిన ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్లింది.

సుశాంత్ తో చిలసౌ సినిమతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన రాహుల్ రవింద్రన్ మన్మథుడు-2తో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి. ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించబడుతుంది. ఆనంద్ ఆర్ట్స్ లో జెమిని కిరణ్ ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు. మరి మన్మథుడిగా మరోసారి నాగార్జున ఎలా అలరిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news