Gossips'మహర్షి' సీన్లుపై మహేష్ ఫైర్..టెన్షన్ లో వంశీ పైడిప‌ల్లి..?

‘మహర్షి’ సీన్లుపై మహేష్ ఫైర్..టెన్షన్ లో వంశీ పైడిప‌ల్లి..?

ప్రిన్స్ మహేష్ బాబు .. డైరెక్షర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘మహర్షి’ సినిమా మీద మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ప్రతి సన్నివేశం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ.. జాగ్రత్తపడుతున్నాడు. ఈ సినిమాతో భారీ హిట్టు కొట్టి తన ఖాతాలో వేసుకునేందుకు మహేష్ ఆరాటపడుతున్నాడు.

ఇప్పటివరకు వచ్చిన అవుట్ పుట్ నుతాజాగా దర్శక నిర్మాతలు..మహేశ్ బాబు కలిసి చూశారట. కీలకమైన కొన్ని సీన్స్ తాను ఆశించినట్టుగా రాలేదంటూ మహేశ్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దాంతో దర్శక నిర్మాతలు అందుకు అంగీకరించినట్టుగా ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి

ఇప్పటికే 50 శాతం టాకీ పార్ట్‌ని, రెండు పాటలను కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ అక్టోబర్‌ 15న న్యూయార్క్‌లో స్టార్ట్‌ కాబోతోంది. సుమారు 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో మహేష్, పూజా హెగ్డే , జయసుధలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.అక్కడే రెండు పాటలను కూడా షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో నవంబర్‌ 10న ప్రారంభం అవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news