Gossipsమహర్షి @రూ.200.. షాక్ లో టాలీవుడ్..!

మహర్షి @రూ.200.. షాక్ లో టాలీవుడ్..!

‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ కొత్తలో కొన్ని ఇబ్బందులు పడ్డారు. సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో కృష్ణ వంశి దర్శకత్వంలో ‘మురారి’ సినిమతో కాస్త ఊరట ఇచ్చింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పోకిరి’సినిమా ఏకంగా సూపర్ స్టార్ రేంజ్ లోకి తీసుకు వెళ్లింది. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లాడు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. భరత్ అనే నేను ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.

ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన 27 రోజులకి 200 కోట్ల గ్రాస్ ను రాబట్టేసి 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక నైజామ్ ఏరియాలో ఈ సినిమా మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది.

ఈ సినిమాలో మహేష్ బాబు మూడు రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ప్రథమార్ధంలోనే మహేశ్ బాబు తన పేరుతో కొత్త రికార్డును నమోదు చేసేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news