Movies‘మహర్షి’ఎంత వసూళ్లు చేసింది..చెప్పేసిన దిల్ రాజు..!

‘మహర్షి’ఎంత వసూళ్లు చేసింది..చెప్పేసిన దిల్ రాజు..!

ఈ సంవత్సరం టాప్ సినిమాల్లో ఒకటిగా వచ్చిన ‘మహర్షి’ బ్లాక్ బస్ట్ అయ్యింది. మహేష్ బాబు 25వ మూవీగా వచ్చిన ‘మహర్షి’అన్ని వర్గాల అభిమానులను బాగా ఆకర్షించింది. ఈ సినిమాలో రైతు సమస్యలు..వారి ఇబ్బందులు..వారిని ఎలా గౌరవించాలన్న కాన్సెప్ట్ చాలా అద్భుతం. ఈ మూవీ ఈ నెల 9వ తేదీన ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘మహర్షి’వసూళ్లు కూడా బాగానే సాధించింది.

అయితే వసూళ్ల విషయంపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు ‘మహర్షి’ నష్టాలు తెచ్చిపెట్టిందనీ, అసలైన వసూళ్ల విషయంలో నిర్మాతలు కూడా అసంతృప్తితో వున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మహర్షి’ మూడువారాలను పూర్తిచేసుకుని నాల్గొవ వారంలోకి అడుగుపెట్టింది. ఇంతవరకూ ఈ సినిమా 100 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇంకో రెండు మూడు రోజుల్లో 30 కోట్ల షేర్ మార్క్ ను చేరుకోనుంది. సమ్మర్ సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా వున్నాము” అని ఆయన అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news