Moviesమహానటిలో మరో అద్భుతమైన సీన్.. చూడకపోతే మిస్సవుతారు..!

మహానటిలో మరో అద్భుతమైన సీన్.. చూడకపోతే మిస్సవుతారు..!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా నుండి మరో అద్భుతమైన సీన్ రిలీజ్ చేశారు. సావిత్రి, సుశీల మధ్య జరిగే ఈ సన్నివేశంలో డీ ఎడిక్షన్ సెంటర్ గురించి చర్చించుకుంటారు. ఈ సీన్ లో కూడా కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఇక షాలిని పాండే కూడా ఈ సీన్ లో బాగుంది.

సినిమాలో ఈ సన్నివేశం అవసరం లేదనుకున్నారో లేక నిడివి పెరుగుతుందని తీశారో కాని ఓ మంచి సన్నివేశం కూడా మహానటిలో మిస్సయ్యింది. ఇప్పటికే 3 సీన్స్ రిలీజ్ చేసిన వైజయంతి బ్యానర్ ఆ డిలీటెడ్ సీన్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన ఈ డిలీటెడ్ సీన్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. కేవలం రన్ టైం ఎక్కువవుతుందని ఉద్దేశంతో ఈ సీన్స్ డిలీట్ చేశామని అంటున్నారు. మరి మొత్తం సినిమా అసలు ఎంత వచ్చిందో రివీల్ చేయలేదు.

ఇక మహానటి ఫలితం విషయానికొస్తే.. పాతిక కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బీభత్సమైన వసూళ్లను రాబట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news