Gossipsఆ పుకార్లపై మండిపడుతున్న రత్తాలు..!

ఆ పుకార్లపై మండిపడుతున్న రత్తాలు..!

అందాల ఆరబోతతలో ఎప్పుడూ ముందుండే రాయ్ లక్ష్మి టాప్ హీరోయిన్ గా రాణించాలని ఎంత ట్రై చేస్తున్నా… ఆమెకు లక్ మాత్రం కలిసిరావడంలేదు. కానీ ఐటమ్స్ సాంగ్స్ తో మాత్రం ప్రేక్షకుల మనసులను మత్తెక్కిస్తోంది. తెలుగు, తమిళ్ ఇలా అన్ని ఫిల్మ్ ఇండ్రస్ట్రీల్లోనూ… తన హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ మీద మీద వచ్చే పుకార్లకైతే ఇక అంతే లేదు. ఎప్పుడూ … ఏదో ఒక పుకారు ఈమె మీద వస్తూనే ఉంటాయి.

క్రికెటర్ ఎంఎస్ ధోనీతో ఈమెకు ప్రేమ వ్యవహారం ఉందని గతంలో అనేక పుకార్లు వినిపించాయి. ఆ విషయాన్ని ఆమె ఖండించినా… పుకార్లు మాత్రం ఆగలేదు. ధోనితో ఉన్న పరిచయంతో ఇండస్ట్రీలో రాణించేందుకు ఆమె ప్రయత్నించింది. కాని అది కూడా వర్కౌట్ అవ్వలేదు. తాజాగా లక్ష్మీరాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ మొత్తం కూడా పుకార్లను ఎదుర్కొంటూనే ఉన్నాను. నా ప్రతి కదలికను కూడా కొందరు తప్పుగా చూపించాలని చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ray lakshmi
ఒక సినిమా షూటింగ్ సందర్బంగా … మామిడి కాయ తింటున్న నన్ను చూసి కొందరు నేను గర్బవతి అంటూ ప్రచారం చేశారు. కేవలం వారి ఛానెల్స్ రేటింగ్ , వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా అంటూ… ఆమె మండిపడింది. త్వరలో వెంకట లక్ష్మి గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా… విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news