Gossipsడార్లింగ్‌తో మసాలా కలుపుతున్న బ్యూటీ

డార్లింగ్‌తో మసాలా కలుపుతున్న బ్యూటీ

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆపై రామ్ చరణ్‌తో కలిసి ‘వినయ వధేయ రామ’ అనే జండుబామ్ సినిమాలో నటించింది. ఈ సినిమా దెబ్బతో మళ్లీ టాలీవుడ్‌లో నటించేందుకు జడుసుకున్న ఈ పాపతో మసాలా కలిపేందుకు టాలీవుడ్ డార్లింగ్ రెడీ అవుతున్నాడు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో ప్రభాస్‌‌తో కలిసి ఓ మాస్ మసాలా సాంగ్‌లో నటించేందుకు కియారా అద్వానీని చిత్ర యూనిట్ కలిసిందట. ఆమె ఈ ఆఫర్‌కు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యిందట. ఒకవేళ ఆమె ఈ పాటను ఓకే చేస్తే.. ప్రభాస్‌తో కలిసి ప్రెస్టీజియస్ సాహో చిత్రంలో భాగం కావడం ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

అయితే ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశాన్ని ఈ పాప వాడుకుంటుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా అందరూ ఇష్టపడే డార్లింగ్‌తో మసాలా కలిపేందుకు కియారా ఒప్పుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news