Newsవామ్మో ! ఆమె నన్ను చంపుతానంటోంది

వామ్మో ! ఆమె నన్ను చంపుతానంటోంది

నందమూరి లక్ష్మీ పార్వతి చంపుతానంటోందంటూ ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆందోళన చెందుతున్నాడు.ఎన్టీయార్ పై తానూ బయోపిక్ తీస్తానంటూ ముందుకొచ్చిన ఈయనకు సినిమా కష్టాలంటే ఏంటో ఇప్పుడు స్వయంగా తెలిసొచ్చింది.

అడుగడుగునా ఆయనకు అడ్డంకులు ఎదురవుతుండడంతో ఆయన బెంబేలెత్తిపోతున్నాడు. ఇలాగయితే ఈ సినిమా నిర్మాణం పూర్తిచేసుకోవడం కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తొలి క్లాప్ కొట్టడానికి హైదరాబాద్ లోని ఎన్టీయార్ ఘాట్ వద్దకెళితే.. అడ్డుకున్నారని, నిమ్మకూరులో షూట్ పెట్టుకుంటే అక్కడా అనుమతివ్వలేదని వాపోతున్నారు.

సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంటి పనుల్ని దిగ్విజయంగా ముగించుకున్న కేతిరెడ్డి.. ఇప్పడు గ్రౌండ్ లెవల్లో దిగేసరికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే.. దీనంతటి వెనుక లక్ష్మిపార్వతే వుందన్నది కేతిరెడ్డి అభియోగం. అప్పట్లో రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్టీయార్ జీవితాన్ని ప్రభావితం చేసిందని, ఇప్పుడు కూడా తన పలుకుబడి ఉపయోగించి సినిమాను అడ్డుకుంటోందని ఆరోపించారాయన.

చంపుతామంటూ కొన్నిరోజులుగా బెదిరింపులు కూడా వస్తున్నాయని కేతిరెడ్డి ఒక వీడియో ద్వారా వెల్లడించారు. తనకు, తన సినిమా ప్రొడ్యూసర్ కు పోలీస్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారాయన.ఇందుకోసం డీజీపీని కలిసి స్వయంగా నా బాధ చెప్పుకుంటానని కేతిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news