Gossipsచిక్కుల్లో పడ్డ కార్తీ సినిమా ! నిర్మాతకు దడేనా ..?

చిక్కుల్లో పడ్డ కార్తీ సినిమా ! నిర్మాతకు దడేనా ..?

అసలు సినిమా నిర్మాణం అంటేనే కత్తిమీద సాములాంటిది. ఒక సినిమా నిర్మాణంలోకి దిగారంటే కష్టమైన నష్టమైనా భరించి పూర్తి చేయాల్సిందే. ఎందుకంటే సినిమా నిర్మాణం మధ్యలో ఆపేస్తే ఆ నిర్మాత కోలుకోలేని దెబ్బతినాల్సిందే. ఒక వేళ కష్టపడి సినిమా నిర్మాణం పూర్తి చేసినా ఆ సినిమా ఫలితం కొంచెం అటు ఇటు అయినా అదే పరిస్థితి. దీంట్లో పూర్తిగా నష్టపోయేది ఒక్క నిర్మాత మాత్రమే.

‘చినబాబు’ హిట్‌ తర్వాత తమిళ కథానాయకుడు కార్తీ నటిస్తున్న చిత్రం ‘దేవ్‌’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. రజత్‌ రవిశంకర్‌ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలిలో జరుగుతోంది. అయితే అక్కడ వరదల కారణంగా చిత్ర షూటింగ్‌ రద్దైంది. అంతేకాదు చిత్ర బృందంలోని 140 మంది వరదల్లో చిక్కుకున్నారు. షూటింగ్‌ రద్దు కారణంగా నిర్మాత లక్ష్మణ్‌కు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న దేవ్ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ పతాకం పై నిర్మాత లక్ష్మణ్ లావిష్ నిర్మిస్తున్నాడు. గతంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో ‘ఖాకి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సషనల్ హిట్ సాధించింది. ప్రస్తుతం కార్తీ వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నట్టు… దీనికి తోడు ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాలు కులుమనాలిలో చిత్రీకరించడం అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news