Gossips'జై సింహా' స్టోరీ... ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా ..?

‘జై సింహా’ స్టోరీ… ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా ..?

గాలి వార్తలకు ఈ మధ్య బాగా ప్రచారం లభిస్తోంది. దీనికి ఒకింత సోషల్ మీడియా కూడా సహకరిస్తోంది. ఎందుకంటే ప్రతి విష్యం కూడా క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతోంది. ఈ ప్రభావం ఈ సినిమాల మీద కూడా బాగా పడినట్టు ఉంది. ఎందుకంటే ఎంతో గోప్యంగా ఉంచాలన్న నిర్మాణంలో ఉన్న సినిమాల గురించి బయటకి పొక్కుతూనే ఉంది. దీన్ని అరికట్టడం మాత్రం సాధ్యపడడంలేదు.

ఈ మధ్య రంగస్థలం సినిమాకు సంబంధించి స్టిల్స్ బయటికి రావడం కలకలం రేపింది . దీనిపై ఆ చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ చేసారు. ఆ గొడవ ఇంకా ముగియకుండానే.. జై సింహ వంతు వచ్చింది. పైసా వసూల్ భారీ దెబ్బ తరువాత బాలకృష్ణ చేస్తున్న 102 మూవీ జై సింహ. సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ సినిమా పై బాలయ్య భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.

అయితే ఆ ఆశలకు తగ్గట్టుగా మాత్రం ఈ సినిమా ప్రమోషన్ జరగడంలేదు. దీని గురించి పెద్దగా ఎక్కడా చర్చ అయితే జరగడంలేదు. ఒకదశలో ఈ సినిమా అసలు సంక్రాంతికి వస్తుందా అనే సందేహం కలుగుతోంది. ఈ విషయమై బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఆందోళనలో ఉన్నారు. జనవరి 12 న ఈ విడుదల అవ్వడం ఖాయం అని నిర్మాత కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. ఇంతలోనే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అంటూ ఓ వార్త బయటకి లీక్ అయిపొయింది.

ఆ కథ ఏంటంటే… ఈ సినిమాలో బాలయ్య సిటీ పోలీస్ కమీషనర్ గా ఉంటాడు. వైజాగ్ సిటీలో అక్రమార్కుల పై సింహ స్వప్నంగా ఉంటూ వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంటాడు.ఈ సమయంలోనే పరిచయం అవుతుంది నయనతార. ఇంకేముంది బాలయ్య ఆమె ప్రేమలో పడిపోతాడు. కాని అనుకోకుండా ఆమెకు కిక్ శ్యాం తో పెళ్ళవుతుంది. ఆ తరువాత విలన్ల కారణంగా వాళ్ళ కాపురం ప్రమాదం లో పడుతుంది. వీళ్ళను కాపాడే బాధ్యత బాలకృష్ణ తీసుకుంటాడు. అయితే విలన్లకు వాళ్లకు అంత సెత్రుత్వం ఎందుకు వచ్చింది..? అనేది మాత్రం సస్పెన్సు అట. అయితే ఈ స్టోరీలో ఎంత నిజం ఉంది ఎంత అబద్దం ఉంది అనేది మాత్రం తెలియదు. ఈ సినిమాకి దర్శకుడు కేఎస్. రవి కుమార్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news