Gossipsసెన్సార్ రివ్యూ.. ఆ హైలైట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

సెన్సార్ రివ్యూ.. ఆ హైలైట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. సింహా సెంటిమెంట్ తో మాస్ అండ్ కమర్సియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉంటుందని సెన్సార్ యూనిట్ చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో సినిమా అందరిని టచ్ చేస్తుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా వైజాగ్ లో ఉంటుందట. అక్కడ రౌడియిజం రూపుమాపేలా చేసేందుకు హీరో ఏం చేశాడన్నది సినిమా కథట.

అంతేకాదు సినిమాలో నయనతార కూడా మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. మాస్, యూత్ తేడాలేకుండా బాలయ్య అలరిస్తాడని.. కచ్చితంగా ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియెన్స్ దగ్గర నుండి బి, సి సెంటర్స్ దాకా దుమ్ము దులిపేయడం ఖాయమని అంటున్నారు. జనవరి 12న సంక్రాంతి సీజన్ కు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news